పరిశ్రమ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన

11 Jul, 2015 15:47 IST|Sakshi

హైదరాబాద్: పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు మృతిచెందితే యాజమాన్యం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ.. అతని బంధువులు, కుటుంబసభ్యులు ధర్నా చేసిన సంఘటన జీడిమెట్లలోని పారిశ్రామిక వాడలో శనివారం జరిగింది. పరిశ్రమలో పనిచేస్తున్న నర్సింహులు(34) పరిశ్రమకు సంబంధించిన పని మీద నిన్న విజయవాడ వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మరణించాడు. అయినా యాజమాణ్యం పట్టించుకోవడంలేదని బంధువులు ఆందోళన చేస్తున్నారు.

మరిన్ని వార్తలు