చికిత్స పొందుతూ కన్నుమూసిన నర్సింగ్‌రావు

14 Jul, 2020 05:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ సీనియర్‌ నేత, అంబర్‌పేట్‌ శంకర్‌ సోదరుడు సి.నర్సింగ్‌రావు (67) సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నర్సింగ్‌రావును కుటుంబ సభ్యులు గత నెల 27న ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ మరుసటి రోజే ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 8న ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నర్సింగ్‌రావు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో పెద్ద దూమారం చెలరేగిన సంగతి విదితమే. ఈ ఘటనపై నర్సింగ్‌రావు కుటుంబ సభ్యులతోపాటు వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, హైబీపీ, మధుమేహం, లంగ్స్‌ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్, న్యుమోనియా తదితర రుగ్మతలతో బాధపడుతున్న నర్సింగ్‌రావు ఆరోగ్యపరిస్థితి విషమించి సోమవారం కన్నుమూశారు. 

మరిన్ని వార్తలు