జాతీయ రహదారి భద్రతావారోత్సవాలు ప్రారంభం

11 Jan, 2015 14:50 IST|Sakshi
హైదరాబాద్: 26వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
రోడ్డుపై ప్రయాణించేపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కార్యక్రమంలో ప్రజలకి అవగాహన కల్పించనున్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయి. దేశంలోని ఢిల్లీ, బెంగళురు, ముంబై, చెన్నై, కోల్కతా, బరోడా, వడోదరా, పూణే, భువణేశ్వర్, హైదరాబాద్, చండీగర్ నగరాలలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
మరిన్ని వార్తలు