లంచం అడిగిన వీఆర్‌ఓ.. నిర్భందించిన గ్రామస్తులు

3 Jun, 2019 15:42 IST|Sakshi

సాక్షి, నవాబుపేట : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేటలో ఉద్రిక్తత నెలకొంది. వీఆర్‌ఓ ఆది నారాయణను గ్రామస్తులు నిర్భంధించారు. తమ పట్టా పాస్‌బుక్‌ల కోసం ముప్పు తిప్పలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వనిదే పని చేయడం లేదని, ఎప్పుడూ మద్యంమత్తులో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడ్డారు. గ్రామపంచాయతీలోని ఒక గదిలో ఉంచి బయట తాళం వేశారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
వీఆర్‌ఓను నిర్బంధించిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు