హ్యుమానిటీస్‌కు కొత్త పాఠ్య పుస్తకాలు

15 Jun, 2019 02:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం హ్యుమానిటీస్‌కు కొత్త పాఠ్య పుస్తకాలను ఇంటర్మీడియట్‌ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఐదేళ్లకోసారి సిలబస్‌ మార్పులో భాగంగా ఈసారి ప్రథమ సంవత్సర కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పుస్తకాల సిలబస్‌ను మార్పు చేసింది. ఆ పుస్తకాలను బోర్డు కార్యాదర్శి అశోక్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తకాలను ముద్రించిన తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు