కేటీఆర్‌కు ‘న్యూ ఎకానమీ ఫోరం’ ఆహ్వానం

8 Oct, 2018 00:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగపూర్‌లో నవంబర్‌ 6, 7 తేదీల్లో జరగనున్న బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరం సమావేశానికి వ్యవస్థాపక ప్రతినిధిగా హాజరు కావాలని మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం అందింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మార్పులను చర్చించేందుకు కొత్తగా న్యూ ఎకానమీ ఫోరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి 300 కంపెనీల ముఖ్య కార్యనిర్వాహక అధికారులు, రాజకీయ నాయకులు, వక్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సమాజంలోని అసమానతలను అరికట్టేందుకు నాలుగేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రసంగించాలని ఫోరం నిర్వాహకులు కేటీఆర్‌ను కోరారు.

మరిన్ని వార్తలు