30 వరకు ఇంటింటా ఓటర్ల గణన

7 Jun, 2018 04:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటా ఓటర్ల గణన చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ ప్రకటించారు. 2019 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జూన్‌ 30 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన పోలింగ్‌ కేంద్రంలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించి సవరణ పక్కాగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.

>
మరిన్ని వార్తలు