కడుపు నొప్పి భరించలేక నవ వధువు ఆత్మహత్య

15 Jun, 2015 18:35 IST|Sakshi

శంషాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా) : కడుపు నొప్పి భరించలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ రూరల్ మండలం  గగన్‌పహాడ్‌కు చెందిన శిరీష(19)కు రెండు నెలల క్రితమే వివాహం అయింది. అయితే కొంత కాలంగా శిరీష తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో నొప్పిని భరించలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు