రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

29 Dec, 2016 02:37 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఇటీవల నల్లగొండ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో 5ఏళ్ల విద్యార్థి ప్రమాదవశాత్తు సాంబార్‌ పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం బుధవారం నోటీసులు వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై 6 వారాల్లో గా నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో నివేదికలో పేర్కొనాలంది. ఈ ఘటన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల భద్రతకు సంబం ధించిందని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు