నల్లగొండ: నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయురాలిని వేధిస్తున్నందుకు నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. టి.రాంబాబు అనే ఉపాధ్యాయుడు అదే స్కూల్లో పనిచేస్తున్న టీచర్ను వేధిస్తుండటంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
(మఠంపల్లి)