తెలంగాణ వాసి మస్కట్ లో మృతి

5 Jul, 2015 15:11 IST|Sakshi

మాచారెడ్డి : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మస్కట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లికి చెందిన ఈరబోయిన అంజయ్య అనే వ్యక్తి గత నెల 22న ఉపాధి నిమిత్తం ఒమన్ రాజధాని మస్కట్ వెళ్లాడు. అయితే, ఆదివారం అతడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు