నారాయణఖేడ్ (మెదక్) : రంగారెడ్డి జిల్లా నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ మీదుగా బీదర్(కర్ణాటక) వెళ్లే మార్గాన్ని ఇకపై 50వ నంబరు జాతీయ రహదారిగా వ్యవహరించనున్నట్లు జాతీయ రహదారుల రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ గణపతిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నారాయణఖేడ్లో విలేకరులతో మాట్లాడారు. ఆర్అండ్బీ ఆధీనంలో ఉన్న నిజాంపేట్- బీదర్ మార్గాన్ని జాతీయ రహదారిగా మార్చి నేషనల్ హైవే నంబరు-50 కేటాయించినట్లు వెల్లడించారు. దీనిని రూ.300 కోట్ల నిధులు వెచ్చించి 50 కిలోమీటర్ల మేర అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఏడాదిలోపు పనులు ప్రారంభం కాగలవని తెలిపారు.