రెండో కౌన్సెలింగ్ ఉండదు: వేణుగోపాలరెడ్డి

29 Oct, 2014 12:48 IST|Sakshi
రెండో కౌన్సెలింగ్ ఉండదు: వేణుగోపాలరెడ్డి

ఈసారి ఇంజనీరింగ్కు రెండో విడత కౌన్సెలింగ్ అంటూ ఉండబోదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేవలం 174 కాలేజీలలో మాత్రమే అడ్మిషన్లు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.

ఇప్పటికే వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో 50 పనిదినాలు పూర్తయిపోయాయని, అందువల్ల స్లైడింగ్కు అనుమతించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో విడత అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి స్పందించారు.

మరిన్ని వార్తలు