రేపటి నుంచి ‘లోక్‌సభ’ నామినేషన్లు

17 Mar, 2019 00:51 IST|Sakshi

25 వరకు కొనసాగనున్న ప్రక్రియ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జారీ చేయనుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సెలవు రోజులు మినహా ఇతర రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. 20న హోలీ పండుగ, 24న ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. మిగిలిన ఆరు రోజుల్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 28తో ముగియనుంది. ఏప్రిల్‌ 11న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.   

మరిన్ని వార్తలు