ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

18 Aug, 2017 02:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దూర విద్యా విధానంలో ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారాలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌.ఆర్‌.ఆచార్య గురువారం విడుదల చేశారు. వచ్చే నెల 14 వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించి కోర్సుల్లో చేరవచ్చని వివరించారు. మరిన్ని వివరాలను  telanganaopenschool. org వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు.

మరిన్ని వార్తలు