ప్రధాని దిష్టిబొమ్మ దహనం

5 Apr, 2016 16:40 IST|Sakshi

నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్శిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వరుసగా పెట్రోలు ధరలు పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు చెప్పారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు