రామడుగు(కరీంనగర్): ఓసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కరీంనగర్ జిల్లా రామడుగు వద్ద రాస్తారొకో జరిగింది. రామడుగు మండలం వెదిరె క్రాస్ రోడ్డులో మండలంలోని ఓసీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాస్తారొకోకు దిగారు. ఉద్యోగావకాశాలు, పదోన్నతుల్లో రాజ్యాంగం ప్రకారం 19 శాతం రిజర్వేషన్ కల్పించాలని నినాదాలు చేశారు. గంటపాటు సాగిన ఈ ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అనంతరం ఆందోళనకారులు మండల కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్కు వినతిపత్రం అందజేశారు.