బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

30 Dec, 2015 13:37 IST|Sakshi

కరీంనగర్ జిల్లాలో బాల్య వివాహాన్ని అధికార యంత్రాంగం అడ్డుకుంది. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన హనుమాండ్ల జానయ్య, పద్మ దంపతుల కుమార్తె(17)కు హిమ్మత్‌నగర్‌కు చెందిన రాజు అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. వివాహం బుధవారం ఉదయం 11.30గంటలకు జరగాల్సి ఉంది. అయితే, గ్రామానికి చెందిన కొందరు ఆర్డీవోకు సమాచారం అందించారు. ఆయన అప్రమత్తం చేయటంతో త హశీల్దార్ బావూసింగ్, ఎస్సై కిరణ్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని పెళ్లిని ఆపుచేయించారు. వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రెండు గ్రామాల సర్పంచిలతో మాట్లాడి.. బాలికకు మైనారిటీ తీరిన తర్వాతే వివాహం చేసేందుకు అంగీకరింపజేశారు.

 

మరిన్ని వార్తలు