రోడ్డునపడ్డ ఓఎల్సీటీ కంపెనీ కార్మికులు

23 Feb, 2016 07:25 IST|Sakshi

నల్లగొండ: జిల్లాకు చెందిన ఓ కంపెనీ లాట్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నార్కట్ పల్లికి చెందిన ఓఎల్సీటీ కంపెనీ లాట్ ప్రకటించడంతో సుమారు 70 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. 3 రోజుల కిందట కార్మికుల దాడిలో మేనేజర్ మస్తాన్ రావు గాయపడి మృతిచెందిన విషయం విదితమే. తరచు వివాదాలు తలెత్తుతున్నాయన్న కారణంగా కంపెనీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆందోళన చేపట్టాలని ఆ కంపెనీ కార్మిక సంఘం నిర్ణయించుకుంది.

>
మరిన్ని వార్తలు