మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య

17 Jan, 2015 15:33 IST|Sakshi

కడెం:

అదిలాబాద్ జిల్లాలో శనివారం ఓ వ్యక్తి మంత్రాల నెపంతో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ కట్టకింది గూడెం గ్రామంలో చోటు చేసుకుంది.

మచ్చినేని చిన్నులు(60) అనే వృద్ధుడు చేతబడులు చేస్తున్నాడనే అనుమానంతో అతని సమీప బంధువులే కొట్టి చంపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు