అపూర్వ సమ్మేళనం

5 Feb, 2018 19:34 IST|Sakshi
సమ్మేళనానికి హాజరైన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌ అర్బన్‌) : జిల్లాకేంద్రంలోని మోడ్రన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 1996–97 బ్యాచ్‌కు చెందిన పదోతరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఒకరినొకరు కలుసుకుని జ్ఞాపకలను గుర్తు చేసుకున్నారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. పూర్వ ఉపాధ్యాయులు మురళీ, సురేందర్, సాయిబాబా, సాయిప్రసాద్, నర్సింగ్‌రెడ్డి, వేణు, మహేష్, శ్రీనివాస్, ఎంవీ రమణ, బల్వంత్‌రావు, నర్సింగ్‌రావు, విజయలక్ష్మీ, అన్నపూర్ణ, పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, రాకేష్, లక్ష్మీనారాయణ, కిరణ్, నిరీల్, ప్రసాద్, కృష్ణ, మధుతోపాటు 100మంది విద్యార్థులు పాల్గొన్నారు.  

 

మరిన్ని వార్తలు