వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

21 Sep, 2015 16:39 IST|Sakshi

కరీంనగర్ (సుల్తానాబాద్) : సుల్తానాబాద్ కూరగాయల మార్కెట్ వద్ద కాసర్ల మల్లమ్మ(80) అనే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. వృద్ధురాలు గట్టిగా అరిచినా దగ్గర ఎవరూ లేకపోవడంతో లాభం లేకపోయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు