హైదరాబాద్ : రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో మక్కా మదీనాలో హజ్ యాత్రికులకు వలంటీర్లుగా డిప్యూటేషన్పై పనిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల (ఖాదీమ్- ఉల్ -హుజ్జాజ్ ) ఎంపిక హజ్ హౌస్లో ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు లక్కీ డ్రా ద్వారా నిర్వహిస్తున్నట్లు హజ్ కమిటీ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎం షుకూర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డ్రా కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శులు సయ్యద్ ఉమర్ జలీల్, షేక్ మహ్మద్ ఇక్బాల్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.