భూపాలపల్లి: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఈ నెల 23న భూపాలపల్లికి వస్తున్నట్లు మాజీ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. 23న రాహుల్గాంధీ పట్టణానికి చేరుకుని ఏరియాలోని ఒక గని అంతర్భాగంలోకి వెళ్లి కార్మికులతో మాట్లాడతారని తెలిపారు.
6న జానారెడ్డి రాక
చిట్యాల: చిట్యాలలోని వ్యవసాయ సబ్మార్కెట్లో ఈనెల 6న జరగనున్న మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి కాంగ్రెస్ మాజీ మంత్రి, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ప్రభుత్వ మాజీ చీఫ్విప్ గండ్ర వెంకటరమణరెడ్డి హాజరవుతారని పార్టీ మండల కమిటీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గొర్రె సాగర్, భైరం భద్రయ్య సోమవారం తెలిపారు.