15న పలు రైళ్ల రద్దు

13 Jun, 2015 01:12 IST|Sakshi
15న పలు రైళ్ల రద్దు

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-ముద్ఖేడ్ సెక్షన్‌లోని కాపలా లేని రైల్వే గేట్ల వద్ద నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 15వ తేదీన పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్ని పాక్షికంగానూ రద్దు కానున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో  ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో  తెలిపారు. ఈ మేరకు నాందేడ్-నిజామాబాద్, నాందేడ్-మేడ్చల్, నిజామాబాద్-బోధన్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు పూర్తిగాను, బోధన్-మిర్జాపల్లి ప్యాసింజర్ బోధన్ నుంచి నిజామాబాద్ వరకు పాక్షికంగానూ రద్దు కానున్నాయి. కాచిగూడ-మన్మాడ్, పుణే-నిజామాబాద్ ప్యాసింజర్ రైళ్లను ఈ మార్గంలో 35 నిమిషాల నుంచి గంటకు పైగా ఆలస్యంగా నడుపుతారు. అలాగే సుల్తానాబాద్-కరీంనగర్ మార్గంలో నిర్మాణపనుల కారణంగా ఈ నెల 15న కరీంనగర్-సిర్పూర్ కాగజ్‌నగర్ ప్యాసింజర్ ట్రైన్ రద్దు కానుంది.

మరిన్ని వార్తలు