ఆటో, లారీ ఢీ

15 Aug, 2015 19:45 IST|Sakshi

నాగర్‌కర్నూలు (మహబూబ్‌నగర్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు మండలం ఉయ్యాలవాడ శివారులోని నల్లవాగు
సమీపంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూలు నుంచి వసంతపురం వెళ్తున్న ప్యాసింజర్ ఆటో నల్లవాగు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న బుచ్చయ్య(49) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 11 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు