బైక్‌ను ఢీకొన్న వాటర్ ట్యాంకర్..ఒకరు మృతి

7 May, 2015 12:17 IST|Sakshi

హైదరాబాద్ సిటీ: సికింద్రాబాద్‌లోని బోయిన్ పల్లి డెయిరీ ఫాం వద్ద బైక్‌ను వాటర్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. దీంతో కాసేపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది.

పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయి వ్యక్తి వివరాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు