ఇసుక లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి

25 May, 2015 17:44 IST|Sakshi

ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం పోతురాజుగడ్డలో సోమవారం ప్రమాదవశాత్తూ ఇసుక లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు