రైలు బోగీ ఎక్కి ఫోటో దిగేందుకు యత్నం, గాయాలు

3 Jan, 2015 13:17 IST|Sakshi

నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరుకు చెందిన రవి అనే యువకుడు శనివారం డెల్టా ప్యాసింజర్ రైలు బోగీ ఎక్కి ఫోటో దిగేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో పైనున్న కరెంట్ తీగలు తగలటంతో అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన రవిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు