యువకుడిపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్

6 May, 2015 11:09 IST|Sakshi

హైదరాబాద్: ట్రాక్టర్ షెడ్‌లో రిపేర్ చేస్తున్న సాయి(22) అనే యువకుడిపైకి ట్రాక్టర్ దూసుకెళ్లటంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కుషాయిగూడ పరిధిలోని నాగార్జునానగర్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు