త్వరపడండి: రూపాయికే గుడ్డు

20 Mar, 2020 10:30 IST|Sakshi

సాక్షి, ఆర్మూర్‌ టౌన్‌: కరోనా దెబ్బకు రోజురోజుకు కోడిగుడ్డు ధర అమాంతంగా పడిపోతోంది. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనే పుకార్లు రావడంతో గుడ్ల వ్యాపారం పడిపోయింది. దీంతో ఆర్మూర్‌ పట్టణంలోని బృందావనం థియేటర్‌ సమీపంలో ఓ గుడ్ల వ్యాపారి కేవలం వంద రూపాయలకే వందగుడ్లు విక్రయిస్తున్నాడు. అదేవిధంగా 100 రూపాయలకే 100 గుడ్లు అని ఆటోలో ప్రచారం చేస్తున్నాడు. దీంతో ప్రజలు తరలివచ్చి గుడ్లను కొనుగోలు చేస్తున్నారు. (అలా పెరిగే కోళ్లతో డేంజర్‌!)

(కోడి కూర.. మాకొద్దు బాబోయ్‌)

మరిన్ని వార్తలు