బోయిన్పల్లి: ఇకపై తపాలా సేవలన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతాయని కరీంనగర్ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి చెప్పారు. బుధవారం జిల్లాలోని బోయిన్పల్లి సబ్పోస్ట్ ఆఫీసులో ఆన్లైన్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తపాలా సేవలను ఆన్లైన్లో అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్డీలు, మనియార్డర్లు సహా అన్నీ ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయన్నారు.