15న ఓయూ సెట్‌ నోటిఫికేషన్‌

8 Apr, 2017 20:12 IST|Sakshi
15న ఓయూ సెట్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌: పలు విశ్వవిద్యాలయాల్లో పీజీ అడ్మిషన్లకోసం నిర్వహించే ఓయూసెట్‌-2017 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఓయూసెట్‌ నోటిఫికేషన్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అశోక్‌ శనివారం తెలిపారు. ఓయూతోపాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐసీ తదితర పీజీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షల ద్వారా సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు