పంచాయతీ రాజ్‌ ఏఈ ఆత్మహత్య

24 Aug, 2017 11:13 IST|Sakshi

జగిత్యాల: వెల్గటూర్ మండలం ఎండపల్లి శివారులో పంచాయితీరాజ్ ఏఈ దేవి శ్రీకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో శ్రీకాంత్‌ ఏఈగా పని  చేస్తున్నాడు.

ఈ ఏడాది మే నెలలో అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 రోజుల క్రితం అదృశ్యమైన శ్రీకాంత్ పత్తి చేను వద్ద గురువారం ఉదయం శవమై కనిపించాడు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటడని భావిస్తు‍న్నారు.

మరిన్ని వార్తలు