జోరుగా నామినేషన్లు

12 Jan, 2019 09:13 IST|Sakshi

కరీంనగర్‌: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. తమ అనుచరగణంతో అట్టహా సంగా నామినేషన్లు వేసి గ్రామాల్లో వేడి రగిలిం చారు. రెండవ విడతలో మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని 107 గ్రామపంచాయతీలకు, 1,014 వార్డు మెంబర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఆయా  మండలాల్లోని క్లస్టర్‌ గ్రామ పంచాయతీల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. తొలి రోజున సర్పంచ్‌ స్థానాలకు 199 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు మెంబర్‌ స్థానాలకు 604 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల దాఖలకు రేపటి వరకు గడువు ఉంది.

మరిన్ని వార్తలు