చికిత్సపొందుతూ పంచాయతీకార్యదర్శి మృతి

14 Sep, 2019 05:42 IST|Sakshi

నాగర్‌కర్నూల్‌: పని ఒత్తిడి తట్టుకోలేక  ఆత్మహత్యకు యత్నించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి స్రవంతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి నిమ్స్‌లో మృతి చెందింది. నాగర్‌కర్నూల్‌ పట్టణానికి చెందిన స్రవంతి గుమ్మకొండలో పంచాయతీకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నక్రమంలో గురువారం మధ్యాహ్నం  కార్యాలయంలోనే పురుగుమందు తాగిన విషయం తెలిసిందే.   స్రవంతి భర్త  8 నెలల క్రితం నాగర్‌కర్నూల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు

మరిన్ని వార్తలు