గాంధీ విగ్రహం ముందు కార్మికుల వినూత్న నిరసన

13 Aug, 2015 19:46 IST|Sakshi
గాంధీ విగ్రహం ముందు కార్మికుల వినూత్న నిరసన

కరీంనగర్ (సుల్తానాబాద్) : జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ముందు పంచాయతీ కార్మికులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు చెవులు, కళ్లు, నోరు మూసుకుని నిరసన తెలియజేశారు.

44 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరి అవలంబించడం సరికాదన్నారు. గాంధీ మార్గాన్ని అవలంబిస్తున్న పంచాయతీ కార్మికులకు స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా శుభవార్త అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చలు జరిపి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.

మరిన్ని వార్తలు