కార్మికుల వినూత్న నిరసన

8 Aug, 2015 13:56 IST|Sakshi

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామపంచాయతీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. వేతనాల పెంపు, రెగ్యూలైజేషన్‌పై సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం జూలై 1 నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగిన కార్మికలు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు