పీఆర్‌ ఇంజనీరింగ్‌ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక  

16 Dec, 2019 02:20 IST|Sakshi

సాక్షి, హన్మకొండ: తెలంగాణ పంచాయతీరాజ్‌ ఇంజనీర్స్‌ అసోషియేషన్‌  రాష్ట్ర కొత్త కార్యవర్గం ఎన్నికైంది. హన్మకొండలో శనివారం రాత్రి రాష్ట్ర సర్వసభ్య భేటీ తర్వాత రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్‌ అనంతరం అర్ధరాత్రి ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా డి.సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షులుగా జి.నరేంద్రప్రసాద్, ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి.వెంకట్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీలుగా ఎ.శ్రీదేవి, వి.సుధీర్‌కుమార్, టెక్నికల్‌ సెక్రటరీగా కె.విద్యాసాగర్, జోనల్‌ సెక్రటరీలుగా కె.ప్రకాశ్, ఎం.బి.రేణుక, కోశాధికారిగా కె.రాజశేఖర్‌ ఎన్నికయ్యారు.  

మరిన్ని వార్తలు