చివరి శ్వాస వరకు టీడీపీలోనే

2 Apr, 2018 12:05 IST|Sakshi
రాజన్నను సన్మానిస్తున్న టీడీపీ నాయకులు

సారంగాపూర్‌ : ‘నా ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా’ నని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న అన్నారు. ఆదివారం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దుబ్బరాజన్న ఆలయంలో మహంకాళి రాజన్నను నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతోనే గ్రామాల్లో క్రియాశీల రాజకీయాలను ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల అధ్యక్షులు అనంతుల గంగారెడ్డి, పొరండ్ల గంగారెడ్డి, ప్రధానకార్యదర్శులు బొమ్మ ప్రమోద్, రామానుజం, ఉపసర్పంచ్‌ స్వామి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు