తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో కనీస వసతులు లేక రోగులు, బాధిత కుటుంబసభ్యులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో గ్లూకోజ్ బాటిళ్లు పెట్టేందుకు స్టాండ్లు లేకపోవడంతో రోగులకు సాయంగా వచ్చిన వారు..నిలబడి సెలైన్ బాటిళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెం ట్ మల్లికార్జునస్వామిని వివరణ కోరగా..ఆస్పత్రిలో స్టాండ్ల కొరత ఉందని తెలిపారు.