మహిళలు పెప్పర్‌ స్ప్రే తెచ్చుకోవచ్చు 

5 Dec, 2019 04:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెట్రోలో ప్రయాణించే మహిళలు ఆత్మరక్షణ కోసం తమ వెంట పెప్పర్‌ స్ప్రే తెచ్చుకునే వెసులుబాటును హైదరాబాద్‌ మెట్రో కల్పిస్తోంది. బెంగళూరు మెట్రోలో అమలులో ఉన్న ఈ విధానాన్ని హైదరాబాద్‌ మెట్రోలో పరిచయం చేస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మెట్రోలో భద్రతా కార్యకలాపాలు పర్యవేక్షించే అధికా రులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. దిశ హత్యాచారం తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు