మూడు ముళ్లకు మూడే ముహుర్తాలు!

16 Nov, 2017 12:42 IST|Sakshi

28 నుంచి శుక్ర మౌఢ్యమి

మరో మూడు నెలలపాటు వివాహాది శుభకార్యాలకు బ్రేక్‌

తొందరపడుతున్న పెళ్లివారు

సాక్షి, హైదరాబాద్‌ : మూడు ముళ్ల బంధానికి ఇక మూడే ముహూర్తాలున్నాయి. మూఢం ముంచుకొస్తుండటంతో వివాహాలు చేయించాలనుకునే పెళ్లివారు తొందరపడుతున్నారు. ఏటా కార్తీక మాసంలో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఈ నెల 9వరకూ గురు మౌఢ్యమి (మూఢం) వివాహాలకు అడ్డుపడింది. మళ్లీ 28 నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఈ మౌఢ్యమి వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు ఉండటంతో వివాహాది శుభకార్యాలకు బ్రేక్‌ పడనుంది. దీంతో ఈ నెల 23,24,25 తేదీల్లో మూడు ముహూర్తాల్లో పెళ్లిళ్లు భారీగా జరుగనున్నాయి. దీంతో పురోహితులకు, ట్రావెల్స్‌, పూల మండపాలకు, వివాహ సామాగ్రికి భారీ డిమాండ్‌ ఏర్పడింది.

మరిన్ని వార్తలు