ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరణ

10 Aug, 2018 19:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్శిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభకు వైస్‌ ఛాన్సలర్‌ అనుమతి నిరాకరించారు. కాగా ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం ఓయూ క్యాంపస్‌ను రాహుల్‌ గాంధీ సందర్శించనున్నారని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా వీసీ అనుమతి నిరాకరించారు. అయితే రాహుల్‌ గాంధీ పర్యటనను ఓయూ అధికారులు నిరాకరించడాన్ని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు ఓయూలోని వీసీ చాంబర్‌లో బైఠాయించారు. రాహుల్‌ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని వారు నినాదాలు చేశారు.  

>
మరిన్ని వార్తలు