సినీ ఫక్కీలో నిజామాబాద్‌లో మోసం

21 Jul, 2019 13:49 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా నవిపేట మండల కేంద్రంలో ఆదివారం సినీ ఫక్కీలో చోరీ జరిగింది. మండలంలోని మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి  యూఏఈ కరెన్సీ అయిన దిర్హమ్‌ కరెన్సీ నోట్ల జిరాక్స్‌ పత్రాలు ఇచ్చి రూ.89వేల ఇండియన్‌ కరెన్సీతో ఉడాయించాడు. ఈ విషయాన్ని షాప్‌ యజమాని మొదట పసిగట్టలేదు. తీరా నకిలీ జిరాక్స్‌ కరెన్సీని గుర్తించి తాను మోసపోయిన విషయాన్ని గ్రహించాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. గతంలోనూ నిజామాబాద్‌, కామారెడ్డిలలో ఇటువంటి చోరీలు జరిగినట్లు సమాచారం ఉంది.

మరిన్ని వార్తలు