హైకోర్టు, బార్ కౌన్సిల్, కేంద్రానికి సుప్రీం నోటీసులు

16 Jan, 2015 11:58 IST|Sakshi
హైకోర్టు, బార్ కౌన్సిల్, కేంద్రానికి సుప్రీం నోటీసులు

హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై మీ వైఖరి ఏమిటో వెల్లడించాలని రాష్ట్ర హైకోర్టు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రానికి..న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి పేర్లను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ చేస్తున్నారని, రెండు రాష్ట్రాలకు ఒకే బార్ కౌన్సిల్ ఉండటం, ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.ప్రభాకర్ గతేడాది ఆగస్టులో  ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు