ప్లాస్టిక్‌ వద్దంటూనే వాడకం

17 Jul, 2018 10:42 IST|Sakshi

సంగారెడ్డి : ‘ప్లాస్టిక్‌ను నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడండి, తినడానికి, తాగడానికి మట్టిపాత్రలు వినియోగించండి’ అంటూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్‌ ఆవరణలో మట్టిపాత్రలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.

కానీ అక్కడ ఈ విషయాన్ని తెలిపేందుకు ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌ వాడొద్దని సూచిస్తూ ప్లాస్టిక్‌ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చూసి కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు