మా ఎంపీ అడ్రస్ చెప్పండి ప్లీజ్...

13 Feb, 2015 20:02 IST|Sakshi

గద్వాల: మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య కనపడటం లేదని టీఎమ్మార్పీఎస్ గద్వాల తాలూకా కన్వీనర్ నందు, కో కన్వీనర్‌లు ప్రదీప్, రవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీ అయిన దగ్గర నుంచి నియోజకవర్గానికి ఒక్కసారి కూడా రాలేదని, వర్గీకరణ బిల్లు గురించి పట్టించుకోవటంలేదని, దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టటంలేదని ఆరోపించారు. ఈ మేరకు ఓ లేఖ ద్వారా గద్వాల సీఐ సురేష్‌కు ఫిర్యాదు చేశారు.

>
మరిన్ని వార్తలు