కల్లు తాగండోయ్‌.. నల్లమందు మానండోయ్‌ 

27 Nov, 2018 16:15 IST|Sakshi
వృద్ధుడికి కల్లు పోస్తున్న పోచారం 

 సాక్షి, బాన్సువాడరూరల్‌: స్వచ్ఛమైన ఈత కల్లు ఆరోగ్యానికి మంచిదని, నల్లమందుతో అనారోగ్యంతో పాటు జేబుకు చిల్లేనని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కోనాపూర్‌ గ్రామానికి వచ్చిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి గౌడ కులస్తులు ఈతకల్లు లొట్టిని బహుకరించారు.

కాస్తరుచి చూసిన ఆయన దాన్ని మరికొందరికి ఇలా పంచుతూ ఆకట్టుకున్నారు. అంతకు ముందు సోమ్లా నా యక్‌ తండాలో గిరిజన మహిళల కోరిక మేరకు వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు.


 

మరిన్ని వార్తలు