నల్లగొండలో కవుల సమ్మేళనం

4 Jun, 2015 18:44 IST|Sakshi
నల్లగొండలో కవుల సమ్మేళనం

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ పట్టణం కేంద్రంలో కవుల సమ్మేళనం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో డ్వామా (జిల్లా నీటి యాజమాన్య సంస్థ) పీడీ (ప్రాజెక్ట్ డైరక్టర్) దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు కవులను ఆయన సన్మానించారు. అంతేకాకుండా ఎన్టీ కాలేజీ అవరణలో తెలంగాణ యూత్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు